కార్యసిద్ధిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయస్వామి శ్లోకాలు:
హనుమంతుడు కార్యసాధకుడు.భక్తితో హనుమంతుని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరుతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.
ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు 48 దినాలు నిష్ఠతో స్మరిస్తూ, ప్రతిరోజు ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి శక్తి కొలది ప్రదక్షిణా సంఖ్యా నియమాన్ని అనుసరించి ప్రదక్షిణలు చేసి ఆ స్వామిని పూజిస్తే తమ తమ కార్యాలలో విజేతలు అవుతారు.
రామం స్కందం హనూమంతం వైనతేయం వృకోదరం !
శయనేయః స్మరేన్నిత్యం దుస్స్వప్నం తస్య నశ్యతి !! 21 సార్లు
లేదా
శివో, మహేశ్వరశ్చైవ, రుద్రో, విష్ణు, పితామహ,
సంసారవైద్య, సర్వేశ, పరమాత్మ సదాశివ !! 3 సార్లు
మనోజవం మారుతతుల్య వేగం
జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం |
వాతాత్మజం వానరయూథ ముఖ్యం
శ్రీరామ దూతం శరణం ప్రపద్యే||
భావము:
మనస్సుని జయించినవాడు, గాలి వేగంతో పయనించేవాడు, పంచేంద్రియాలను తన అధీనంలో ఉంచుకున్నవాడు,గొప్ప తెలివిగలిగినవాడు, వానరులలో ముఖ్యుడు, శ్రీ రామచంద్రునకు దూత అయిన హనుమంతునికి ప్రణామం చేస్తున్నాను.
యత్ర యత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృత మస్తకాంజలిం|
భాస్పవారి పరిపూర్ణ లోచనం
మారుతిం నమత రాక్షసాంతకం||
భావము:
దయ్యాల బారి నుండి కాపాడేవాడు, ఎక్కడ శ్రీ రాముని పొగిడినా కళ్ళలో నీళ్ళు, రామ భజన చేస్తూ పులకరించిపోయేవాడైన హనుమంతునికి నమస్కారము.
బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగతా|
అజాడ్యం వక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్||
భావము:
ఎవరైతే హనుమంతున్ని నిత్యం ధ్యానిస్తారో వారు ఆరోగ్యం, ఐశ్వర్యం, బుద్ధి, బలం, ధైర్యం, పేరుప్రఖ్యాతులు, ఙ్ఞానం, వాక్చాతుర్యం తప్పక పొందగలుగుతారు.
అంజనానందం వీరం
జానకీ శోక నాశనం|
కపీషమక్ష హంతారం
వందే లంకాభయంకరం||
భావము:
అంజనాదేవి కుమార,జానకీ మాతా శోకాన్ని పోగొట్టినవాడా,వానరమూక రాజా, లంక రాజుకు భయం పుట్టించిన వాడా, రావణుని రెండవ కుమారుడైన అక్షను సం హరించిన ఆంజనేయ నీకు వందనాలు.
ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం
యః శోకవహ్నిం జనకాత్మజాయా
ఆదాయ తేనైవ దదాహ లంకాం
నమామి త్వం ప్రాంజలీరాంజనేయం
భావము:
ఎవరైతే సముద్రాన్ని ఆడుతూ పాడుతూ సునాయాసంగా దాటగలిగినాడో, జనకుని కుమార్తె అయిన జానకీమాత శోకాన్ని చూసి తట్టుకోలేక ఆ శోకంతోనే లంకని దహింపజేసిన హనుమా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.
గోష్పదీకృత వారాశిం
మశకీకృత రాక్షసం|
రామాయణం మహామాలారత్నం
వందే అనిలాత్మజం||
భావము:
గోమాత యొక్క పాదాల మధ్య దూరాన్ని దాటినంత సునాయాసంగా సముద్రాన్ని దాటి దోమలను చంపినంత సులభంగా రాక్షసవధ చేసి రామాయణం అనే వజ్రమాలలో ఒక వజ్రంలాగా నిత్యం మెరిసే ఆంజనేయ నీకు నమస్కారము.
అతులిత బలధామం స్వర్ణశైలభ దేహం
దనుజవనక్రుశానుం ఙ్ఞానినాం అగ్రగణ్యం|
సకలగుణ నిధానం వానరాణాం అధీశం
రఘుపతిప్రియభక్తం వాతజాతం నమామి||
భావము:
ఎవరికీ సమానము రాని శక్తిని సొంతం చేసుకొని,బంగారు వర్ణం కలిగిన కొండంత శరీరం, భూతప్రేతపిశాచాలకు ఆవేశంతో ఉన్న అగ్నిపర్వతంలా కనబడి,ఙ్ఞానునలో అగ్రగణ్యుడు,అన్ని మంచి లక్షణాలు కలిగి ఉండి, వానర మూకకు అధిపతి అయి శ్రీ రామచంద్రమూర్తికి నమ్మిన బంటు అయిన వాయుపుత్రుడైన హనుమంతునికి నమస్కారాలు.
ఆంజనేయమతిపాటలాలనం
కాంచనాద్రి కమనీయ విగ్రహం|
పారిజాత తరుమూల వాసినం
భావయామి పవమాన నందనం||
భావము:
అంజనాదేవి కుమారుడు, దుష్టులను సం హరించేవాడు, అందమైన కొండంత బంగారు శరీరం కలిగి, పారిజాత చెట్టును నివాసం చేసుకున్న వాయుపుత్రుడికి నమస్కారాలు.
ఆమూషీకృత మార్తాండం;
గోష్పతీ కృత సాగరం|
తృణీకృత దశగ్రీవం
ఆంజనేయం నమామ్యహం||
భావము:
సూర్య భగవాణుడిని తినాలని అనుకున్నవాడు, గోమాత పాదాల మధ్య దూరాన్ని దాటినంత సునాయాసంగా సముద్రాన్ని దాటినవాడు, రావణుడిని పట్టించుకోనివాడైన ఆంజనేయుడికి నమస్కారము.